Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆహార నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసా?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (21:00 IST)
మరో ఏడాదిన్నర పాటు పేదలకు కావలసిన ఆహార ధాన్యాలకు ఇబ్బంది లేకుండా దేశవ్యాప్తంగా రిజర్వులో ఉన్నాయని వెల్లడించారు పుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా ఛైర్మన్​ డి. వీ. ప్రసాద్​. అంతే కాకుండా ఏప్రిల్​ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్​ టన్నుల ఆహార ధాన్యాలు ఉంటాయని స్పష్టం చేశారు.

భారత్‌లోని పేదలకు మరో ఏడాదిన్నర పాటు ఆహారధాన్యాలకు ఇబ్బంది లేకుండా రిజర్వులు ఉన్నాయని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డి.వి.ప్రసాద్‌ తెలిపారు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలు ఉంటాయని తెలిపారు.

మన దేశంలో పేదల వార్షిక అవసరాలకు 50 మిలియన్‌ టన్నుల నుంచి 60 మిలియన్‌ టన్నులు సరిపోతాయని ప్రసాద్‌ వెల్లడించారు. 2019-20 వార్షిక సంవత్సరానికి భారత్‌ రికార్డు స్థాయిలో 292 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేస్తుందని అంచనాలు ఉన్నాయి.

వాస్తవానికి గత ఏడాది కంటే ఈ సారి అధికంగా పండనున్నాయి. ఆహార ధాన్యాల కొరతగురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రసాద్‌. దేశంలోని అన్ని ప్రాంతాలకు అవసరమైన గోదాములు, బియ్యం ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజా పంపిణీ ద్వారా ఆహార ధాన్యాలు పొందుతున్న వారు 6 నెలలకు సరిపడా ముందే కొనుగోలు చేసుకోవచ్చని ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments