Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కాల్పుల కలకలం - కారులో నుంచి పారిపోయిన అల్లుళ్లు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (08:44 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర ఢిల్లీలోని బారా హిందూరావ్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజీబ్‌ అనే ప్రాపర్టీ డీలర్‌ ఈద్గా ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఈయన మేనమామకు రాణి ఝాన్సీ రోడ్డులోని ఫిలిమిస్తాన్‌లో ఓ క్లినిక్‌ ఉంది. గురువారం రాత్రి వారు క్లినిక్‌‌కు తాళం వేసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
 
క్లినిక్ షట్టర్‌కు తాళం వేసి వారిద్దరూ కారులో కూర్చోగానే.. ఓ యువకుడు వచ్చి వారి కారుకు అడ్డంగా నిల్చున్నాడు. అనంతరం మరో వ్యక్తి కూడా వచ్చాడు. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన మామా అల్లుళ్లు కారులో నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పారిపోయారు. 
 
అయినప్పటికీ దుండుగులు వారిని వదిలిపెట్టలేదు. వారిపై కాల్పులు జరపారు. అయితే, ఆ సమంయలో అటుగా వెళ్తున్న వారికి ఆ బుల్లెట్లు తగలడంతో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ఒకరిని గుర్తించామని, మరొకరు ఎవరనే విషయం ఇంకా తెలియలేదని వెల్లడించారు. కాగా, ఐదు నుంచి ఆరుగురు ఈ కాల్పులకు తెగబడ్డారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments