Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర మాజీ మంత్రి పీఆర్ సతీమణి హత్య.. ఇంట్లో శవమై..?

కేంద్ర మాజీ మంత్రి పీఆర్ సతీమణి హత్య.. ఇంట్లో శవమై..?
, బుధవారం, 7 జులై 2021 (10:31 IST)
PR Kumaramangalam Wife
కేంద్ర మాజీమంత్రి పీఆర్ కుమారమంగళం భార్య మంగళవారం రాత్రి ఢిల్లీలోని నివాసంలో హత్యకు గురయ్యారు. కిట్టి కుమారమంగళం (67) దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
కిట్టీ కుమారమంగళం హత్య కేసులో నిందితుడు ఒకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హత్య ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
 
కిట్టీ కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆమె భర్త పీ రంగరాజన్‌ కుమారమంగళం మొట్టమొదట 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991-92 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 
 
వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 1998లో ఆయన విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కుమారుడు రంగరాజన్‌ మోహన్‌ కుమారమంగళం కాంగ్రెస్‌ నేత. బెంగళూరులో నివాసం ఉంటుండగా.. తల్లి హత్య వార్త తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి బయలుదేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ 'దేవదాసు' దిలీప్ కుమార్ ఇక లేరు