Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిక్కర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 25 నుంచి 21 ఏళ్లకు వయోపరిమితి తగ్గింపు

Advertiesment
Bars Till 3 am
, మంగళవారం, 6 జులై 2021 (12:54 IST)
ఢిల్లీ ప్ర‌భుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్ర‌క‌టించింది. 2021-22 ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకున్నాయి. నిన్నటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం రాష్ట్ర రెవెన్యూకి చాలా ముఖ్యమని ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. మందు తాగే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించింది.
 
ఈ కొత్త పాలసీలో ప్రభుత్వ రీటెయిల్ వైన్ షాపులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ షాపులను ప్రమోట్ చేస్తూ పాలసీని తయారు చేసింది. అంతేకాదు వైన్ షాపులు పూర్తి ఎయిర్ కండిషన్ తో, గ్లాస్ డోర్లతో ఉంటాయి. 
 
లిక్కర్ కొనుగోలుదారులు షాపుల ఎదుట బారులు తీరకుండా, షాపులోకి వచ్చి వారికి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేయవచ్చు. బీర్ల కోసం మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లోని బార్లు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరిచి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్