Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో విమానంలో చెలరేగిన మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (15:05 IST)
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానంలో నుంచి మంటలు చెలరేగాయి. పాట్నా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. 
 
ఈ విమానం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. పాట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ ఐన కొద్ది సేపటికే విమానం ఎడమ ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. 
 
దీంతో ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని తిరిగి పాట్నా విమానాశ్రయంలో అత్యవరసర ల్యాండింగ్‌ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
దీనిపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ).. పక్షి ఢీ కొట్టడం వల్లే మంటలు వచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే ఇంజిన్‌ను ఆపేసిన పైలట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments