మా విమానం ఎక్కాలంటే 4 గంటలు ముందు రావాల్సిందే : ఇండిగో

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:34 IST)
దేశంలో నడుస్తున్న ప్రైవేటు విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఓ హెచ్చరిక లాంటి సూచన చేసింది. తమ విమానాల్లో ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు నాలుగు గంటలు ముందుగానే ఎయిర్‌‍పోర్టుకు రావాలని సూచింది. చెకిన్, బోర్డింగ్‌లకు అధిక సమయం పడుతుందని, అందువల్ల 3 గంటల 50 నిమిషాల కంటే ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని కోరింది. అలాగే, 7 కిలోలకు మించి బరువును తమ వెంట క్యారీ చేయొద్దని తెలిపింది. సెక్యూరిటీ తనిఖీలు సాఫీగా, పూర్తిగా చేసుకునేందుకు ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు తమ వెంట 7 కేజీలకు మించని బ్యాగ్‌తోనే రావాలని కోరింది.
 
ఇదే అంశంపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. "ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. దీంతో చెకిన్, బోర్డింగ్ సమయం అన్నది సాధారణ రోజులతో పోలిస్తే పడుతోంది" అని సూచన జారీచేసింది. సౌకర్యం కోసం వెబ్ చెకిన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గేట్ నంబరు 5, 6 ద్వారా టెర్మినల్ 3కి చేరుకుంటే దగ్గరగా ఉంటుందని తెలిపింది. కాగ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments