Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానందకు బ్రిటన్ ఎంపీలు పార్టీ ఇచ్చారా..?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:13 IST)
భారత్‌లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న నిత్యానందకు బ్రిటన్ ఎంపీలు పార్టీ పెట్టారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద భారతదేశంలో వివిధ క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉంటూనే కైలాస అనే కొత్త ద్వీప దేశాన్ని సృష్టించి, దానికి నాణేలు, పాస్ పోర్టులు జారీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో నిత్యానందపై మరో వార్త సంచలనం రేపుతోంది. 
 
ఇంగ్లండ్‌లోని ఇద్దరు ఎంపీలు నిత్యానందను పార్టీకి ఆహ్వానించినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. భారత్‌లో వాంటెడ్ క్రిమినల్ కోసం ఇంగ్లండ్‌లో పార్టీ పెట్టిన వార్త వివాదాస్పదమైనప్పటికీ, సంబంధిత ఎంపీ అలాంటి పార్టీ ఏమీ జరగలేదని కొట్టిపారేశారు.
 
హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో దీపావళి పార్టీకి నిత్యానంద హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో భారతదేశం నుండి పారిపోయాడు. 
 
ఆపై అతను "రిపబ్లిక్ ఆఫ్ కైలాస"ను ఏర్పాటు చేశాడు. నిత్యానందకు భారతదేశంలో భారీగా అనుచరులు వున్నారు. డజనుకు పైగా దేవాలయాలు, ఆశ్రమాలను నడిపాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments