Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ కష్టాల్లో చిక్కుకున్న యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (12:54 IST)
లాక్డౌన్ కష్టాల్లో చిక్కుకున్న 16 యేళ్ళ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో ఆమె తన సొంతూరికి వెళ్లేందుకు ప్రయత్నాలుచేపట్టింది. ఈ విషయం తెలిసుకున్న ముగ్గురు యువకులు.. తాము రైలు ఎక్కిస్తామని నమ్మబలికి ఆ యువతిని తమ వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఢిల్లీకి వలస వచ్చి ఓ ఇంట్లో పని చేస్తూ జీవిస్తోంది. అయితే, లాక్డౌన్ కారణంగా ఆ యువతి ఉపాధి కోల్పోయింది. దీంతో సొంతూరుకు వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ నుంచి న్యూఢిల్లీ రైల్వేస్టేషనుకు చేరుకుంది. 
 
ఆ స్టేషన్‌లో ఉన్న ముగ్గురు యువకులు... జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని మాయమాటలు చెప్పి... తమతో బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ బాలికకు మద్యంతాగించారు. అనంతరం బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి, రోడ్డుపై వదిలివేసి పారిపోయారు.
 
ఆ  బాలిక అనుమానాస్పదంగా మత్తులో జోగుతూ నడుస్తుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ గమనించి ఆమెను పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. మహిళా పోలీసులు ప్రశ్నించగా బాలిక సామూహిక అత్యాచారం గురించి చెప్పింది. దీంతో బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం