Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా.. స్వస్థలానికి వెళ్ళేందుకు రైలు ఎక్కిస్తామని.. బాలికపై సామూహిక అత్యాచారం

కరోనా.. స్వస్థలానికి వెళ్ళేందుకు రైలు ఎక్కిస్తామని.. బాలికపై సామూహిక అత్యాచారం
, మంగళవారం, 16 జూన్ 2020 (09:26 IST)
మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన మహిళలపై ఆగడాలు తగ్గట్లేదు. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న 16 ఏళ్ల అమ్మాయిని స్వస్థలమైన జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామంటూ మాయమాటలు చెప్పిన ముగ్గురు యువకులు ఆమెను తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న 16 ఏళ్ల అమ్మాయి తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వేస్టేషనుకు వచ్చింది. అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వేస్టేషనుకు చేరుకుంది. జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని మాయమాటలు చెప్పి బాలికను ముగ్గురు యువకులు తీసుకువెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. 
 
అనంతరం బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత బాలికను రోడ్డుపై వదిలేశారు. బాలిక అనుమానాస్పదంగా మత్తులో జోగుతూ నడుస్తుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ గమనించి ఆమెను పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. 
 
మహిళాపోలీసులు ప్రశ్నించగా బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి అద్దె చెల్లించలేదని తుపాకీతో కాల్పులు జరిపిన యజమాని