Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీమా సొమ్ముకు ఆశపడి, తననే హత్య చేయమని సుపారీ: పని పూర్తిచేసిన హంతకులు

బీమా సొమ్ముకు ఆశపడి, తననే హత్య చేయమని సుపారీ: పని పూర్తిచేసిన హంతకులు
, మంగళవారం, 16 జూన్ 2020 (08:12 IST)
తాను పడుతున్న ఆర్థిక కష్టాలు తన కుటుంబ సభ్యులు పడరాదని ఆ వ్యాపారి భావించాడు. పైగా, తాను చనిపోతే బీమా సొమ్ము వస్తుందని ఆశపడ్డాడు. ఆ డబ్బుతో తన కుటుంబం హాయిగా జీవిస్తుందని ఊహించుకున్నాడు. అంతే.. తనను హత్య చేయాల్సిందిగా కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారు. వారు సుపారీ తీసుకున్న తమ విధిని తు.చ తప్పకుండా పాటించారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఢిల్లీకి చెందిన గౌరవ్ బన్సాల్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే, గత ఫిబ్రవరిలో రూ.6 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. ఆ సొమ్మును మానసిక ఒత్తిడిని అధికమించే చికిత్స కోసం వినియోగించాడు. 
 
అలాగే, క్రెడిట్ కార్డు మోసాల్లో రూ.3.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఓ దశలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో తాను చనిపోతే వచ్చే బీమా డబ్బుతో కుటుంబం అయినా హాయిగా బతుకుతుందని భావించాడు.
 
తన మనసులో ఆలోచన రాగానే.. ఓ కిరాయి ముఠాకు చెందిన మైనర్ బాలుడిని సంప్రదించి, తన ప్లాన్ వివరించాడు. అంతేకాదు, తన ఫొటోను కూడా ఆ మైనర్‌కు పంపించాడు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఫలానా ప్రదేశానికి వస్తాడని చెప్పి, అక్కడికి తానే వెళ్లాడు. 
 
ఆ కుర్రాడు మరో ముగ్గురి సాయంతో గౌరవ్ బన్సాల్‌ను చంపి చెట్టుకు వేలాడదీశాడు. అయితే, తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య షాను బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పని మీద బయటికెళ్లి తిరిగిరాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తమ విచారణలో భాగంగా గౌరవ్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఇందులో ఓ మైనర్ కుర్రాడితో ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో సొంత హత్యకు సుపారీ వ్యవహారం వెల్లడైంది. 
 
ఈ ఘటనలో మైనర్ బాలుడితో సహా మనోజ్ కుమార్ యాదవ్, సూరజ్, సుమిత్ కుమార్‌లను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆ వ్యాపారి దురాశ చివరకు బీమా సంగతి అటుంచితే తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లోకి వెళ్లి దాక్కోవడం లోకేశ్‌కు అలవాటు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్