Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:37 IST)
స్మగ్లర్లు వింత వింతగా ఆలోచనలు చేస్తున్నారు. తాము చేసే స్మగ్లింగ్ సాఫీగా సాగిపోయేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఖర్జూరం పండ్ల మాటున బంగారం స్మగ్లింగ్ చేయడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ స్మగ్లింగ్ గట్టును బహిర్గతం చేశారు. ఆ ప్రయాణికుడు వద్ద 172 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్వీ 756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి వచ్చిన 56 యేళ్ల వయసున్న ఒక ప్రయాణికుడుపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగేజీ చెకింగ్ సమయంలో అతని లగేజీపై వారికి అనుమానం వచ్చింది. అతని వద్ద ఖర్జూర పండ్ల మాటను ఓపెన్ చేసి పరిశీలించారు. 
 
ఆ పండ్లలో బంగారు ముక్కలను అమర్చినట్టు గుర్తించారు. ఆ ఖర్జూర పండ్ల బ్యాగులో ఒక బంగారు చైన్‌ను కూడా అధికారులు గుర్తించారు. ఖర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments