Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు..

Advertiesment
gold

సెల్వి

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:13 IST)
బంగారం ధరలు పెరుగుతున్న ధోరణిని కొనసాగిస్తున్నాయి. స్థిరంగా వుండే ధరలకు సంబంధించిన సంకేతాలు కనిపించడం లేదు. కొనసాగుతున్న వివాహాల సీజన్ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. కొనుగోలు దారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. వరుసగా రెండవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇది వినియోగదారులలో ఆందోళన కలిగిస్తోంది.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధర మునుపటి రోజుతో పోలిస్తే రూ.200 పెరిగి, 10 గ్రాములకు రూ.84,007కి చేరుకుంది. 
 
అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి, ప్రస్తుత ధర 10 గ్రాములకు రూ.87,770కి చేరుకుంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి, కిలోగ్రాముకు ధర రూ.1,07,000 వద్ద ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ అధికారి నివాసంలో మిస్టరీ మరణాలు!!