Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లు అడిగిన పాపానికి కోవిడ్ రోగిపై దాడి.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (13:15 IST)
మంచినీళ్లు అడిగిన పాపానికి ఓ కోవిడ్ రోగి పట్ల వైద్య సిబ్బంది చితకబాదిన ఘటన రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ బాధితుడు మృతి చెందినట్లు అతని కుటుంబీకులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాకర్‌ పాటిల్‌ అనే వ్యక్తి రాజ్‌కోట్‌ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. 
 
పరీక్షల అనంతరం అతడి కిడ్నీలో నీరు చేరిందని ఆపరేషన్‌ చేయాలని తెలిపారు వైద్యులు. దాంతో ప్రభాకర్‌ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. సమస్య తీరిపోయింది అనుకుంటుండగా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దాంతో వైద్యులు అతడికి కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ప్రభాకర్‌ సెపప్టెంబర్‌ 8న రాజ్‌కోట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ క్రమంలో తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా నర్సింగ్‌ సిబ్బందిని కోరాడు. దాంతో వారు ప్రభాకర్‌పై దాడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు కలిసి ప్రభాకర్‌ మీద దాడి చేయడం చూడవచ్చు. ఇకపోతే, ప్రభాకర్‌ ఈ నెల 12న మరణించాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments