Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 70 వేలు దాటిన కరోనా కేసులు.. తెలంగాణలో మళ్లీ వేగం

Webdunia
మంగళవారం, 12 మే 2020 (09:30 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 వేలు దాటిపోయింది. గత 24 గంటల్లో మరో 3604 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70756కు చేరింది. ఇకపోతే, గత 24 గంటల్లో 87 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 2293కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 22,454 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 46,008 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ దేశంలో ప్రతి రోజూ కనీసం మూడువేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఇపుడు ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు, తెలంగాణలో కరోనా మళ్లీ పెరుగుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే 79 కేసులు వెలుగు చూశాయి. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. మొత్తంగా  తెలంగాణలో ఇప్పటివరకు 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, సోమవారం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50 కాగా, కోలుకున్నవారి సంఖ్య 801కి పెరిగింది. ప్రస్తుతం 444 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, మరణాల సంఖ్య 30 అని తెలంగాణ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments