Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా వైరస్

మహారాష్ట్ర పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా వైరస్
, సోమవారం, 11 మే 2020 (17:27 IST)
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ దూకుడు అంతా ఇంతా కాదు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే 30 శాతం కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే, ఆ రాష్ట్ర పోలీసు శాఖను కరోనా వైరస్ వణికిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 221 మంది పోలీసులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో కరోనా వైరస్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 1007కు చేరింది. ఇందులో 106 మంది పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా, ఈ వైరస్ బారినపడి ఏడుగురు పోలీసులు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. 
 
కాగా, మహారాష్ట్రలో ఏకంగా 22 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇదే అత్యధికం. ఒక్క ముంబై మహానగరంలో ఏకంగా 12 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ముంబై తర్వాత పూణె, థానేలలో అత్యధిక కేసులు నమోదైవున్నాయి. అలాగే, మహారాష్ట్రలో ఇప్పటివరకు 832 మంది ప్రాణాలు విడిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌లో 4జీ సేవలు పునఃప్రారంభం.. సుప్రీం తిరస్కరణ