మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పరీక్షలు.. ఫలితం నెగటివ్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (09:13 IST)
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని కొత్త ఔషధాల వాడకంతో రియాక్షన్‌ వచ్చి జ్వరం రావడంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌ను ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి విదితమే. 
 
సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ముందస్తు జాగ్రత్తగా మన్మోహన్ సింగ్‌కు కరోనా నిర్ధారణ పరీక్ష కూడా నిర్వహించామని, ఫలితం నెగెటివ్‌ అని వచ్చిందని పేర్కొన్నాయి.
 
నిజానికి.. ఆయనకు కరోనా పరీక్షలు చేస్తున్నప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరీక్షల్లో ఏం తేలుతుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ.. ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడడంతో ఆయనను ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments