Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో 8వేల మార్కును దాటిన కరోనా కేసులు.. రైళ్లు వద్దు సార్..

తమిళనాడులో 8వేల మార్కును దాటిన కరోనా కేసులు.. రైళ్లు వద్దు సార్..
, సోమవారం, 11 మే 2020 (20:21 IST)
తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం కొత్తగా మరో 798 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 వేల మార్కును దాటి 8,002కు చేరింది.

ఇక సోమవారం కొత్తగా మరో ఆరుగురు కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 53కు చేరింది. మొత్తం కేసులలో 2,051 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 5,895 మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు సీఎం పళనిసామి కీలక సూచన చేశారు. తమిళనాడు రాష్ట్రానికి మే 31 వరకు రైళ్లు నడపవద్దని, రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తిచేశారు. ఇంకా విమాన రాకపోకలకు కూడా అనుమతి ఇవ్వవద్దని కోరారు.

ఇలా చేయడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని.. కొత్త కేసులు నమోదు కావన్నారు. ఇక ప్రధాని కూడా పళనిసామి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ ఇలా ఎందుకు చేశారంటూ కె.ఎ. పాల్ ప్రశ్న