Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 12,881 కేసులు.. 334 మృతి

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (09:53 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే భారత్‌లో 12,881 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 24గంటల వ్యవధిలో మరో 334 మంది చనిపోయారు. 
 
ఇప్పటి వరకూ భారత్‌లో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,66,946కు చేరింది. ప్రస్తుతం 1,60,384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం వరకు 1,94,325 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12,237కు పెరిగింది.
 
అలాగే దేశంలో గడచిన 17రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రెట్టింపు అయిందని లెక్కలు చెబుతున్నాయి. మే 31 వరకు దేశంలో 1, 82, 000 పాజిటివ్‌ కేసులు, 5, 164 మరణాలు నమోదయ్యాయి. అంటే జనవరి నుండి మే 31 దాకా నమోదయిన కరోనా కేసులు ఎన్నో, మే 31 నుండి జూన్ 17 దాకా అన్ని కేసులు నమోదయ్యాయి. 
 
జూన్‌ 17నాటికి కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజు వారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ లలో నిత్యం పదివేల చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments