Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న కరోనావైరస్: ఒక్కరోజులోనే 12,881 కేసులు

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (09:48 IST)
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా ఒకే రోజులో 12,881 తాజా కేసులను నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనావైరస్ రోగుల సంఖ్య 3,66,946కు చేరుకుంది.
 
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ... ఈ మూడు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో అధిక సంఖ్యలో కారోనావైరస్ కేసులను నమోదయ్యాయి. మరోవైపు ఉత్తర ప్రదేశ్, హర్యానాలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,237కు పెరిగింది. గత 24 గంటల్లో కనీసం 334 మంది మరణించారు.
 
కాగా 1,60,384 యాక్టివ్ కరోనావైరస్ రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనావైరస్ రోగులలో 50% పైగా కోలుకున్నారు. కరోనావైరస్ కేసులు తీవ్రంగా నమోదవడంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఎక్కువ మంది ప్రజలు ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నందున భయపడవద్దని అందరినీ కోరారు.
 
బుధవారం మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు 3,300 మందికి పైగా పాజిటివ్ అని తేలింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,16,752కు చేరుకుంది. మొత్తమ్మీద కేసులు తీవ్రంగా నమోదవుతున్న రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments