Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న కరోనావైరస్: ఒక్కరోజులోనే 12,881 కేసులు

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (09:48 IST)
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా ఒకే రోజులో 12,881 తాజా కేసులను నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనావైరస్ రోగుల సంఖ్య 3,66,946కు చేరుకుంది.
 
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ... ఈ మూడు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో అధిక సంఖ్యలో కారోనావైరస్ కేసులను నమోదయ్యాయి. మరోవైపు ఉత్తర ప్రదేశ్, హర్యానాలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,237కు పెరిగింది. గత 24 గంటల్లో కనీసం 334 మంది మరణించారు.
 
కాగా 1,60,384 యాక్టివ్ కరోనావైరస్ రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనావైరస్ రోగులలో 50% పైగా కోలుకున్నారు. కరోనావైరస్ కేసులు తీవ్రంగా నమోదవడంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఎక్కువ మంది ప్రజలు ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నందున భయపడవద్దని అందరినీ కోరారు.
 
బుధవారం మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు 3,300 మందికి పైగా పాజిటివ్ అని తేలింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,16,752కు చేరుకుంది. మొత్తమ్మీద కేసులు తీవ్రంగా నమోదవుతున్న రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments