Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషెంట్ ఓవరాక్షన్.. డాక్టర్‌ఫై ఉమ్మివేశాడు.. పోలీసులకు ఫిర్యాదు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:25 IST)
కరోనా బాధితులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాపై పోరాటం చేస్తూ.. బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సుల పట్ల కరోనా రోగులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ఉమ్మివేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఓ పేషెంట్‌ శనివారం అడ్మిట్ అయ్యాడు. కానీ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు ఏమాత్రం సహకరించలేదు. ఇంకా వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే తన మాస్క్‌ను తీసివేసి దానిని డాక్టర్‌పై విసిరేశాడు. అంతటితో అగకుండా వైద్యునిపై ఉమ్మి వేశాడు. అలాగే ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యహరించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం అందిస్తున్న వైద్యులపై ఇలా ప్రవర్తించడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. ిజన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments