చంద్రబాబు చేయి తాకిన చిదంబరానికి జైలు కష్టాలు... ఎవరు?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:12 IST)
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవకాశం దొరికితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేసేస్తున్నారనే టాక్ వుండనే వుంది. ఇపుడు మళ్లీ విజయసాయి... దూకుడు చిత్రంలో మహేష్ బాబు.. మళ్లీ ఏసేశారు అన్నట్లు ట్విట్టర్లో ఓ సెటైర్ విసిరారు. ఇంతకీ ఆయన ఏమని పేర్కొన్నారో చూడండి.
 
'బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అంతటితో ఆగకుండా మరో ట్వీట్ వేశారు. అదేంటంటే... 'ఛీ..ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబు గారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని ధూషించి యావజ్జాతిని అవమానిస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments