Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ - షా ద్వయం అనుమతితోనే రివర్స్ టెండరింగ్ : విజయసాయి రెడ్డి

మోడీ - షా ద్వయం అనుమతితోనే రివర్స్ టెండరింగ్ : విజయసాయి రెడ్డి
, బుధవారం, 21 ఆగస్టు 2019 (18:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టినట్టు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో పాటు.. కేంద్ర జలవనరుల శాఖను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పీపీఏతో పాటు.. కేంద్రం గుర్రుగా ఉంది. పైగా, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న నవయుగ కంపెనీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అంశంపై వాడివేడిగా చర్చసాగుతోంది. 
 
దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, అవినీతిని అడ్డుకునే విషయంలో తమ సంకల్పానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. 
 
మోడీతో మాట్లాడాకే వీటిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢసంకల్పమని విజయసాయి రెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై పోలీసులను బండబూతులతో చీల్చిచెండాడిన జొమాటో డెలివరీ గర్ల్...