Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలి.. ఫ్లెక్సీలు లేకుంటే పెళ్లిళ్లు జరగవా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:56 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన పళ్లికరణిలో ఓ ఫ్లెక్సీ కూలి బీటెక్ యువతి దుర్మరణం పాలైన కేసుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పైగా, గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. 
 
పళ్లికరణి రహదారి డివైడర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి శుభశ్రీ (22) అనే బీటెక్ యువతి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. అక్రమ హోర్డింగ్స్ ఏర్పాటుపై గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు సీరియస్ అయింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు నిదీసింది.
 
తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే నిర్లక్ష్యమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఫ్లెక్సీలు లేకుండా నేతల పెళ్లిళ్లు జరగవా అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. పైగా, చెన్నై బీచ్‌లో ఉన్న అన్ని రాజకీయ బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలంటే అధికారులకు లెక్కలేదా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మద్రాస్‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments