చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (10:42 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవభూమిగా భాసిల్లే పుణ్యభూమి కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథుడుని దర్శనం చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. భారీ మంచు కారణంగా సుధీర్ఘకాలం మూసివుండే ఈ పుణ్యక్షేత్రం శుక్రవారం తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా భక్తులపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. తలుపులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం 13 టన్నుల పూలను వినియోగించారు. 
 
కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్‌ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ రోజున తెరవగా, బద్రీనాథ్ ఆలయాన్ని మాత్రం ఈ నెల 4వ తేదీన తెరుస్తారు. కేదార్‌నాథ్ ఆలయం మాత్రం శుక్రవారం తెరుచుకుంది. 
 
మరోవైపు, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ చార్‌ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు, భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments