Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (10:30 IST)
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఉన్నట్టుంటి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన లుగురు ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలుల ధాటికి ద్వారక ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న బోరుబావి గదిపై పెద్దవేప చెట్టు కూలిపడింది. దీంతో ఆ గదిలో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు చిక్కుకుని పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది వారిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించగా వారంతా అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఇంటి యజమాని అజయ్‌ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 
 
ఢిల్లీలో దంచికొట్టిన వర్షం - విమాన రాకపోకల్లో ఆలస్యం 
 
ఢిల్లీలో వర్షం దంచి కొడుతోంది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోతవర్షం కురిసింది. ఈ వర్షంతో  వేసవి నుంచి ఢిల్లీ ప్రజలకు కొంతమేరకు ఉపశమనం లభించినట్టయింది. అయితే, రోజువారి దినచర్యలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరోవైపు, వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో మరో 40 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీచేసింది. అటు ఎయిరిండియా, ఇండిగో కూడా తమ ప్రయాణికులకు అలెర్ట్ సందేశాలు పంపించాయి. తాజా అప్‌‍డేట్ కోసం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. 
 
మరికొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలెర్ట్ జారీచేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తెల్లవారుజామున కురిసిన వర్షానికి లజ్‌పత్ నగర్, ఆర్కేపురం, ద్వారక తదితర ప్రాంతాల్లో వర్షపునీరు వచ్చి చేరింది. ఇటు హర్యానా రాష్ట్రంలోనూ భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments