Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రయాన్-2'కు యేడాది - మరో ఏడేళ్ళకు సరిపడా ఇంధనం

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్-2. రెండో లూనార్ మిషన్‌గా పేరున్న చంద్రయాన్-2, చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టబడి గురువారానికి సరిగ్గా ఓ యేడాది పూర్తి చేసుకుంది. 
 
గత సంవత్సరం జూలై 22న చంద్రయాన్-2ను లాంచ్ చేయగా, దాన్ని ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరిక్షణంలో విఫలమైంది. ల్యాండ్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో భూమిని బలంగా ఢీకొనడంతో ఈ ప్రయోగం విఫలమైంది. 
 
అయితే, చంద్రయాన్-2లోని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తోంది. దీనిలో 8 రకాల శాస్త్రీయ పరికరాలు ఉన్నాయని, ఇవన్నీ ఇప్పుడూ సక్రమంగానే పనిచేస్తున్నాయని, ఇంతవరకూ చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 4,400 సార్లు పరిభ్రమించిందని ఇస్రో పేర్కొంది.
 
పైగా, ఇది చాలా చక్కగా పనిచేస్తోందని, విడిభాగాలన్నీ కూడా సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఈ ఆర్బిటర్‌లో మరో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందని, దీని ద్వారా చంద్రునిపై మరింత కాలం పాటు పరిశోధనలు సాగించవచ్చని, ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా దృష్టిపెట్టని చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తున్నామని ఇస్రో అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments