Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. స్పాన్సర్‌గా చైనా కంపెనీ.. చివరికి ఏమైందంటే?

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. స్పాన్సర్‌గా చైనా కంపెనీ.. చివరికి ఏమైందంటే?
, బుధవారం, 19 ఆగస్టు 2020 (11:03 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 అనే కంపెనీ ఎంపికైన సంగతి తెలిసిందే. ఎంపికైన గంటల వ్యవధిలోనే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఆ దేశానికి చెందిన వివో కంపెనీని టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి తప్పించిన బీసీసీఐ.. బిడ్స్ ఆహ్వానించి డ్రీమ్ 11కి మంగళవారం స్ఫాన్సర్‌షిప్‌ని ఇచ్చింది. 
 
రూ.222 కోట్లకి బిడ్‌ని దాఖలు చేసిన డ్రీమ్ 11కి స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌, గత కొన్నేళ్లుగా ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటిగా ఉండటం కలిసొచ్చింది. బిడ్స్ దాఖలు చేసిన బైజూస్, అన్అకాడమీ సంస్థల్ని పక్కనపెట్టి డ్రీమ్ 11కి ఐపీఎల్ 2020 స్ఫాన్సర్‌షిప్‌ని బీసీసీఐ కట్టబెట్టిన గంటల వ్యవధిలోనే డ్రీమ్ 11లో చైనా పెట్టుబడులు ఉన్నాయనే వార్త వెలుగులోకి వచ్చింది. చైనాకి చెందిన టెన్సెంట్ కంపెనీ.. డ్రీమ్ 11లో పెట్టుబడులు పెట్టినట్లు తేలడంతో.. మళ్లీ వివాదం రాజుకుంది. 
 
ఈ డ్రీమ్ 11లో వాటాదారులు, ఉద్యోగులు (400 మంది) భారతీయులేనని వివరణ ఇచ్చిన ఆ సంస్థ.. చైనాకి చెందిన టెన్సెంట్ కేవలం 10 శాతం లోపే పెట్టుబడులు పెట్టిందని చెప్పుకొచ్చింది. దీంతో వివాదం సమసిపోయినట్లు కనిపిస్తున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ రిటైర్మెంట్ : కలత చెందిన పాక్ వీరాభిమాని.. కీలక ప్రకటన