Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను చంపేసి ప్రియుడితో లేచిపోయిన తల్లి

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (12:36 IST)
ఆ కసాయి తల్లికి కన్నబిడ్డ కంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. ప్రియుడుతో పడకసుఖాన్ని పంచుకునేందుకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడుతో పారిపోయింది. ఈ దారుణం ఛండీఘర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛండీఘర్‌కు సమీపంలోని బురాలి గ్రామానికి చెందిన దశరథ్‌ అనే వ్యక్తి భార్య, రెండున్నరేళ్ళ కుమారుడు ఉన్నాడు. దశరథ్‌ వృత్తి రీత్యా ఎలక్ట్రిషీయన్‌. అయితే ఆయన భార్యకు మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలుడిని తన ఇంట్లో బెడ్‌ బాక్స్‌లో కుక్కింది. అరవకుండా ఉండేందుకు బాలుడి నోట్లో బట్ట ముక్క కుక్కి.. తన ప్రియుడితో లేచిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చిన దశరథ్‌ తన భార్య, కుమారుడి కోసం గాలించాడు. 
 
తొలుత బంధువుల ఇంటికెళ్లి ఉండొచ్చు అని దశరథ్‌ భావించాడు. కానీ బంధువుల ఇంటికి వారు వెళ్లలేదు. దీంతో భార్యకు ఫోన్‌ చేయగా.. బాలుడిని బెడ్‌ బాక్స్‌లో ఉంచినట్లు చెప్పింది. బెడ్‌ బాక్స్‌ను తెరిచి చూడగా పిల్లాడు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. దశరథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments