Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ జోడో యాత్ర : రాహుల్ గాంధీపై కేసు నమోదు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (09:41 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఆయన గత కొన్న రోజులుగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి నుంచి ప్రారంభమై కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. 
 
పాదయాత్రలో "కేజీఎఫ్-2" చిత్రంలోని పాటలను వినియోగించారంటూ రాహుల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 'కేజీఎఫ్-2' పాటలపై హక్కులను కలిగివున్న బెంగుళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కాపీరైట్ ఉల్లంఘనల చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ చిత్రంలోని హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుడా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో వీడియోలు రూపొందిస్తున్నారంటూ ఎమ్మార్టీ మ్యూజిక్ కంపెనీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments