Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణంలో పరువు హత్య.. కుమార్తెను చంపిన తండ్రి!

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (09:19 IST)
విశాఖపట్టణంలోని ఒకటో పట్ణణ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు హత్య జరిగింది. ప్రేమించిన యువకుడితో లేచిపోయిన కుమార్తెను కన్నతండ్రి హత్య చేశాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు స్వయంగా వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖ రెల్లి వీధికి చెందిన వరప్రసాద్, హేమలత అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమర్తెలు. పైగా ఈ దంపతులు చాలాకాలం క్రితం విడిపోయారు. పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉంటుంది. రెండో కుమార్తె లిఖిత శ్రీ (15) తండ్రితో కలిసి ఉంటూ పదో తరగతి చదువుకుంటుంది. వరప్రసాద్ మహప్రస్థానం వాహన డ్రైవరుగా పని చేస్తూ కుమార్తెను పెంచుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో లిఖితశ్రీ ఇటీవల తాను ప్రేమించిన యువకుడితో లేచి పోయింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాలు రాజీకి వచ్చారు. గురువారం తన కుమార్తెను వరప్రసాద్ ఇంటికి తీసుకెళ్లాడు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో లిఖితశ్రీ అచేతనస్థితిలో పడివుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న వారు కేసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వరప్రసాద్‌ వద్ద విచారించగా అసలు విషయం వెల్లడించారు. పెద్ద కుమార్తె ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని, రెండో కుమార్తె కూడా ప్రేమ అంటూ దూరం కావడాన్ని భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments