Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో చిక్కుకున్న బస్సు- 36మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Webdunia
శనివారం, 22 జులై 2023 (15:03 IST)
Bus
దేశంలో రుతుపవనాలు పూర్తి స్వింగ్‌లో వున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా యూపీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లాంటి పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా బస్సు నదిలో చిక్కుకుపోయింది. 
 
36 మంది ప్రయాణికులతో వెళ్తున్న రోడ్డు మార్గం బస్సు మండవాలి జిల్లా పరిధిలోకి వచ్చే బిజ్నోర్‌లోని కోట వాలి నదిలో చిక్కుకుంది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులు దాదాపు మూడు గంటల పాటు నరకం అనుభవించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 
అక్కడ బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల అరుపులు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నది ప్రవాహానికి బస్సు కొట్టుకుపోకుండా జేసీబీతో బస్సును స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. 
 
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం బస్సులో మూడు డజన్ల మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. 
 
బస్సు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసే పని ప్రారంభించారు. చివరికి బిజ్నోర్‌లోని కొత్వాలి నదిలో ఇరుక్కున్న ఈ బస్సు నుండి ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments