Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు..

Advertiesment
Virat Kohli
, శుక్రవారం, 21 జులై 2023 (16:18 IST)
Virat Kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కోహ్లి వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. వన్డేలు, టెస్టుల్లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ ఇప్పుడు తన విజయాల కిరీటంలో మరో మైలురాయిని చేర్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు అతనికి 500వ అంతర్జాతీయ టెస్టు. 
 
ఈ మైలురాయిని సాధించిన 10వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో మైదానంలో ఉన్న కోహ్లి.. తన ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగెడుతూ పరుగులు జోడిస్తున్నాడు. 
 
రెండు పరుగులకే డైవ్ చేయగా వెస్టిండీస్ వికెట్ కీపర్ కోహ్లీని ప్రశంసించాడు. "నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు.. అది కూడా 2012 నుంచి" అంటూ కోహ్లి నవ్వుతూ అతని ప్రశంసలు అందుకున్నాడు.
 
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా జోరు కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డే ప్రపంచకప్ ట్రోఫీని విడుదల చేసిన ఐసీసీ.. షారూఖ్ అలా చూస్తూ..?