Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు.. వీడియోలు చూస్తుందని చంపేశాడు..

Webdunia
గురువారం, 1 జులై 2021 (23:05 IST)
అన్నయ్య చెల్లెమ్మకు ప్రేమగా స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. కానీ అదే చెల్లెలి ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్‌లో అదేపనిగా వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్నయ్య.

సుడలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురంలో నివాసం ఉంటున్నాడు. రైతు అయిన సుడలైకి కొడుకు మలైరాజా(20), కూతురు కవిత(17) ఉన్నారు. 
 
కవిత ప్లస్ టూ చదువుతోంది. కాగా, మలైరాజా తన చెల్లి కవితకు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్‌పోన్‌లో వీడియోలు చూడటం మొదలుపెట్టింది. ఈ విషయమై మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. అయినా కవిత పట్టించుకోలేదు. 
 
ప్రతి రోజు దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని కోపానికి లోనైన మలైరాజా.. కవితను వెనుక నుంచి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన కవిత మృతి చెందింది. ఆ తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వల్లానాడు సమీపంలో రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments