Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల లైంగిక దాడి

మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల లైంగిక దాడి
, గురువారం, 1 జులై 2021 (09:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు కామాంధులకు స్వయానా బాధితురాలి సోదరి సహకరించడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుల్తాన్‌పూర్‌ జిల్లాలో తనిఖీల్లో భాగంగా గత మంగళవారం రాత్రి పోలీసులు సుల్తాన్‌పూర్‌లో ఓ లగ్జరీ బస్సును ఆపారు. అందులో తనిఖీ నిర్వహిస్తుండగా, చివరి సీటు కింద ముగ్గురు చిన్నారులను గుర్తించారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. 
 
వారిని విచారించగా ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిపినట్లు తేలిందని పోలీసు అధికారి బల్దీరాయ్‌ రాజారామ్‌ చౌదరీ చెప్పారు. దీంతో బస్సు డ్రైవర్‌తోపాటు, ఓ బాలుడు, బాధితురాలి సవతి సోదరిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెటిరోకు జగన్ సర్కార్ భారీ గిఫ్ట్ : కేసు పెట్టలేదుకదా భూములు అప్పగింత