Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ తీసుకుందామని యంత్రంలో చేయిపెట్టిన చిన్నారి.. తర్వాత?

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (15:33 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ చిన్నారి తల్లి కళ్ల ముందే యంత్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... థానే జిల్లాలోని ఆనంద్‌ నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న పూజా కుమారి.. అంబరనాథ్‌ ప్రాంతంలో ఉన్న ఓ బిస్కెట్‌ కంపెనీలో కార్మికులకు లంచ్‌ బాక్సులు సరఫరా చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె లంచ్‌ బాక్సులు ఇవ్వడానికి తన మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ను వెంటబెట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్లింది. ఆమె కార్మికులకు లంచ్‌ బాక్సులు ఇస్తున్న సమయంలో చిన్నారికి యంత్రంలోని పడిపోయిన బిస్కెట్‌ ముక్కలు కనిపించాయి. వెంటనే ఆ మెషీన్ లోని బిస్కెట్లు తీసుకునేందుకు ఆ చిన్నారి చేయి చాచింది. అంతే మెషిన్ లో ఉన్న బ్లేడ్‌కు మెడ చిక్కుకోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 
 
కార్మికులు వెంటనే యంత్రాన్ని ఆఫ్‌ చేసి, ఆయుష్‌ను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అప్పటి వరకు అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments