Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మారథాన్ రన్నర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. ఎక్కడ?

Woman Fire

ఠాగూర్

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:16 IST)
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న మారథాన్ రన్నర్‌కు ఆమె ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో చోటుచేసుకుంది. ఈ దేశానికి చెందిన రెబెక్కా చెప్టెగీ గత కొన్ని రోజులుగా కెన్యాకు చెందిన డిక్కన్ డియెమ మరగ‌చ్‌తో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో తరచూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్న మరగచ్.. ఇటీవల ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటల ధాటికి రెబెక్కా హాహాకారాలు చేయడంతో స్థానికులు ఆమెను కెన్యాలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఆమె దాదాపు 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెబెక్కాపై దాడి విషయం తెలిసి ఉగాండా ప్రజలతో పాటు ఒలింపిక్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు డెయెమ మరగచ్‌పై గృహహింస, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు మెడల్స్