Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు మెడల్స్

paralimpics games

ఠాగూర్

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:34 IST)
పారిస్‌లో పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఈ క్రీడాపోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారుల తమ అద్భుతంగా రాణిస్తున్నారు. పురషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎల్ ఎల్ 3లో నితేశ్ కుమార్ సోమవారం పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్స్‌లో 21-14, 18-21, 23-21తో డానియేల్ బ్రిటన్‌కు చెందిన బెతెన్‌ను ఓడించారు. 
 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎస్‌యూ 5 పైనల్‌లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో చైనాకు చెందిన క్రీడాకారిణి యాంగ్ క్విక్సియా చేతిలో ఓటమిని చూవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రేన్‌ను చిత్తు చేసింంది. దీంతో సోమవారం పతకాల సంఖ్య 11కు చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024 చివరి నాటికి రిటైర్మెంట్ తీసుకుంటా.. సైనా నెహ్వాల్ వెల్లడి