Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవే : మనీశ్ తివారీ

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (09:27 IST)
దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవేనని, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీగా మరోమారు బాధ్యతలు స్వీకరిస్తే దేశంలో ప్రత్యక్ష ఎన్నికలంటూ ఉండవలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశానికి చివరి ఎన్నికలు ఇవే అవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఆయనను నిలువరించడానికి ఇండియా కూటమి బరిలో నిలిచిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని వ్యాఖ్యానించారు.
 
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ నాలుగో తేదీన విపక్ష కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు తథ్యమని తాము తొలి దశ పోలింగ్ నుంచే ఇదే చెబుతున్నామన్నారు. బీజేపీ దక్షిణాన కనుమరుగు కానుందని, ఉత్తరాదిన సగానికే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments