Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవే : మనీశ్ తివారీ

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (09:27 IST)
దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవేనని, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీగా మరోమారు బాధ్యతలు స్వీకరిస్తే దేశంలో ప్రత్యక్ష ఎన్నికలంటూ ఉండవలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశానికి చివరి ఎన్నికలు ఇవే అవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఆయనను నిలువరించడానికి ఇండియా కూటమి బరిలో నిలిచిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని వ్యాఖ్యానించారు.
 
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ నాలుగో తేదీన విపక్ష కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు తథ్యమని తాము తొలి దశ పోలింగ్ నుంచే ఇదే చెబుతున్నామన్నారు. బీజేపీ దక్షిణాన కనుమరుగు కానుందని, ఉత్తరాదిన సగానికే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments