Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు పడింది.. ఈసీ ఆదేశాలు

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా మే 13వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరణగణం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, అధికార పార్టీకి, ఆ పార్టీ నేతలకు అంటకాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తుంది. ఇప్పటికే ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎప్సీలపై వేటు వేసిన ఎన్నికల సంఘం తాజాగ మరో ఇద్దరు ఐపీఎస్‌లపై చర్యలు తీసుకుంది. వీరిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణాలు ఉన్నారు. వీరిద్దరిని ఎన్నికలు ముగింసేంతవరకు ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే వారిస్థానంలో కొత్త నియామకాలు చేపట్టింది. ఏపీ స్టేట్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పి.హెచ్.డి. రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ ఏప్రిల్ 25వ తేదీన గురువారం మధ్యాహ్నం 11 గంటలలోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం