Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతరలో అగ్నిగుండ ప్రవేశం చేసిన బీజేపీ నేత

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (17:26 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన జాతరలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత దులన్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భాగంగా పది మీటర్ల వరకు ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
 
'పూరీ జిల్లాలోని రెబాటి రామన్ గ్రామంలో జరిగిన ఝాము జాతరలో పాల్గొన్నాను. నిప్పులపై నడిచి అమ్మవారిని పూజించాను. ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని వారి శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించాను. అగ్నిగుండంపై నడిచి అమ్మవారి దీవెనలు పొందడం వల్ల పుణ్యం పొందాను' అని ఆయన ట్వీట్‌ చేశారు. 
 
ఝాము జాతరలో కోరికలు నెరవేరాలని అమ్మవారు దులన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి  భక్తులు నిప్పుల మీద  నడవడం ఇక్కడి సంప్రదాయం. ఒడిశాకు చెందిన సంబిత్‌ పాత్రా 2010లో భారతీయ జనతా పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాత్రా చురుకుగా పాల్గొనడంతో పార్టీ ఆయన్ను భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, బిజూ జనతా దళ్‌ అభ్యర్థి పినాకి మిశ్రాతో తలపడి ఓడిపోయారు. ప్రస్తుతం ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments