Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీ మనోహర్ జోషీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (17:23 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషీ ఆస్పత్రి పాలయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖమాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కనుమూయగా ఆయన అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఈ అంత్యక్రియలు ముగిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి అనారోగ్యం ఉండటంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. 
 
తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 
 
కాగా, జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలాగే, గత యేడాది కాలంలో వాజ్‌పేయి నుంచి జైట్లీ వరకు అనేక మంది అగ్రనేతలు చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments