Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీ మనోహర్ జోషీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (17:23 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషీ ఆస్పత్రి పాలయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖమాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కనుమూయగా ఆయన అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఈ అంత్యక్రియలు ముగిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి అనారోగ్యం ఉండటంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. 
 
తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 
 
కాగా, జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలాగే, గత యేడాది కాలంలో వాజ్‌పేయి నుంచి జైట్లీ వరకు అనేక మంది అగ్రనేతలు చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments