Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకౌంట్లో రూ. 1.18 లక్షలు.. అంత్యక్రియల కోసం బ్యాంకుకు శవం..

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:14 IST)
అనాధగా మారిన 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. పాట్నాకు చెందిన ఈ వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగానే జీవిస్తున్నాడు. కానీ ఆయన మృతి చెందడంతో అంత్యక్రియలు ఎవరు చేయాలి? డబ్బులు ఎక్కడ్నుంచి తేవాలి? అనే ప్రశ్న గ్రామస్తుల్లో వాదన మొదలైంది. దీంతో ఆ కూలీ ఇంటినంతా గాలించారు. ఎక్కడా ఒక్క పైసా కూడా దొరకలేదు. చివరకు బ్యాంకు ఖాతా పుస్తకం కనిపించింది. ఆ ఖాతా బుక్‌ను పరిశీలించగా.. అకౌంట్లో రూ. 1.18 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.
 
కూలీ అంత్యక్రియలకు డబ్బుల కోసం గ్రామస్తులంతా కలిసి మృతదేహాన్ని తీసుకొని బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఆయన ఖాతాలో ఉన్న డబ్బుల్లో రూ. 20 వేలు ఇవ్వాలని, వాటితో అంత్యక్రియలు నిర్వహిస్తామని బ్యాంకు అధికారులను గ్రామస్తులు కోరారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం వారి ప్రతిపాదనను తిరస్కరించారు. కచ్చితంగా కూలీ సంతకం లేదా నామినీ వస్తేనే డబ్బులు డ్రా చేయొచ్చు అని స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు వినిపించుకోకుండా బ్యాంకు వద్ద నిరసన వ్యక్తం చేశారు.
 
చివరకు బ్యాంకు మేనేజర్ కల్పించుకొని.. సీఎస్ఆర్ ఫండ్ కింద కూలీ అంత్యక్రియలకు రూ.10 వేలు అందజేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.5 వేలు ఇచ్చాడు. మొత్తం రూ. 15 వేలతో కూలీ అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments