Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయిలతో రాసలీలలు... ఉద్యోగాలు ఊడగొట్టుకున్న జడ్జీలు!

అమ్మాయిలతో రాసలీలలు... ఉద్యోగాలు ఊడగొట్టుకున్న జడ్జీలు!
, బుధవారం, 23 డిశెంబరు 2020 (11:43 IST)
వ్యభిచార కేసుల్లో పట్టుబడే వారికి శిక్షలు విధించే న్యాయమూర్తులే వ్యభిచారం చేశారు. పైగా, పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ విషయం హైకోర్టుకు చేరడంతో విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో చేసిన తప్పును అంగీకరించిన న్యాయమూర్తులకు బీహార్ ప్రభుత్వం శిక్ష విధించింది. అంటే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది బిహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్నేళ్ళ క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు జడ్జీలు నేపాల్‌కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో బసచేసిన వారు.. తమ గదులకు అమ్మాయిలను పిలిపించుకుని రాసలీలల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు హోటల్‌లో రైడ్ చేయడంతో వారు స్వయంగా పట్టుబడ్డారు.
 
ఇలా పట్టుబడిన జడ్జీల్లో బీహార్‌లోని సమస్తిపూర్‌లో గతంలో ప్రిన్సిపల్‌ జడ్జిగా పనిచేసిన హరి నివాస్‌ గుప్తా, మరో ఇద్దరు జడ్జీలు జితేంద్రనాథ్‌ సింగ్‌, కోమల్‌ రాంలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పాట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు ముగ్గురు జడ్జీలు తప్పు చేసినట్లు ధ్రువీకరించారు.
 
దీంతో హైకోర్టు ఈ ముగ్గురిని ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముగ్గురు జడ్జీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ముగ్గురు జడ్జిలను ఉద్యోగాల నుంచి తొలిగిస్తున్నట్లు బీహార్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ ఆమోదంలో విఫలం.. కుప్పకూలిన ఇజ్రాయెల్ సర్కారు!