Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నదిలో బంగారం, వెండి నాణేలు.. పరుగులు తీసిన జనం

నదిలో బంగారం, వెండి నాణేలు.. పరుగులు తీసిన జనం
, సోమవారం, 11 జనవరి 2021 (12:08 IST)
బంగారం, వెండి నాణేలు దొరుకుతున్నాయంటే.. ఆ ప్రాంతానికి జనాలు పరుగులు పెట్టరూ. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నదిలో నాణేల కోసం గాలింపు చేపట్టారు. అక్కడక్కడ తవ్వకాలు కూడా జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎనిమిది రోజుల క్రితం కొంతమంది మత్స్యకారులకు రాజ్‌ఘర్ జిల్లాలోని పార్వతి నదితో బంగారు, వెండి నాణేలు లభించాయి.
 
ఈ వార్త క్రమంగా అందరి చెవుల్లో పడిపోయింది. దీంతో రాజ్‌ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్‌పూరా గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకుని నాణేల కోసం వేట ప్రారంభించారు. నీళ్లలోకి దిగి కొందరు బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం వెతుకుతుండగా ఒడ్డునే ఉన్న బురద పెల్లలను తొలగిస్తూ మరి కొందరు ఆ నాణేల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కంపెనీలకు వాట్సప్‌ను అస్సలు వాడొద్దంటున్నాయ్.. ఎందుకు..?