Webdunia - Bharat's app for daily news and videos

Install App

హై ఫీవర్‌తో పరీక్షలకు వెళ్లిన విద్యార్థి మృతి..

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:42 IST)
హై ఫీవర్‌తో బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యా సంవత్సరం వృథా కారాదన్న ఆలోచనతో హై ఫీవర్‌తో బోర్డు పరీక్షలకు బీహార్ షరీఫ్‌లోని ఆదర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ కుమార్ పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత అతడి అనారోగ్య కారణాల వల్ల సంబంధిత పరీక్షా కేంద్రంలోని స్కూల్ యాజమాన్యం అనుమతి నిరాకరించినా.. సంవత్సరం వేస్ట్ అవుతుందన్న భయంతో పరీక్ష రాస్తానని పట్టుబట్టాడు. 
 
దీంతో పరీక్ష నిర్వాహకులు ఒకవైపు జిల్లా పరీక్షల కంట్రోల్ రూమ్‌తోనూ, అతడి తల్లిదండ్రులతోనూ సంప్రదించారు. చివరకు రోహిత్ కుమార్ తల్లి వచ్చి తన కొడుకును పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరింది.
 
అయితే, పరీక్ష రాస్తుండగా అతడి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో రోహిత్ కుమార్‌ను చికిత్స కోసం దవాఖానకు తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆస్తమా వల్లే రోహిత్ మరణించాడని ఆమె తల్లికి తర్వాత వివరించారు. బీఎస్ఈబీ బోర్డు పరీక్షల్లో భాగంగా శుక్రవారం సోషల్ సైన్స్ పరీక్ష ఫస్ట్ షిప్ట్‌లో జరిగింది. కానీ ప్రశ్నపత్రం లీకైందని వార్తలొచ్చాయి. దీంతో ఈ పరీక్ష రద్దు చేశారు. వచ్చే నెల 8వ తేదీన తిరిగి సోషల్ సైన్స్ పరీక్ష నిర్వహిస్తారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments