Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో భీకర పేలుడు - కుప్పకూలిన భవనాలు.. ప్రాణనష్టం

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (14:56 IST)
బీహార్ రాష్ట్రంలో భీకర పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ పేలుడు రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో జరిగింది. 
 
గురువారం రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఏడుగురు మరణించగా, పలువురుకి గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దాలు 4 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించాయి. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతమంతా కంపించింది. అంటే ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు. 
 
తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కజ్‌బాలి చక్‌‍లో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ పేలుడులో మృతి చెందినవారంతా ఎన్నోయేళ్లుగా బాణాసంచా తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన బాణాసంచాను ఇంటిలో నిల్వచేసి వుంటారని, ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments