Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో భీకర పేలుడు - కుప్పకూలిన భవనాలు.. ప్రాణనష్టం

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (14:56 IST)
బీహార్ రాష్ట్రంలో భీకర పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ పేలుడు రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో జరిగింది. 
 
గురువారం రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఏడుగురు మరణించగా, పలువురుకి గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దాలు 4 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించాయి. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతమంతా కంపించింది. అంటే ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు. 
 
తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కజ్‌బాలి చక్‌‍లో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ పేలుడులో మృతి చెందినవారంతా ఎన్నోయేళ్లుగా బాణాసంచా తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన బాణాసంచాను ఇంటిలో నిల్వచేసి వుంటారని, ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments