Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక : మంత్రి సబిత

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (14:16 IST)
మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని తెలంగాణాలో మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎపుడూ కోరుకుంటారన్నారు. నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారన్నారు. అలాగే, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో వేసవి వస్తే నీళ్ల కోసం మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ఇపుడు ఇంటి వద్దే 24 గంటలు నీళ్లు వస్తున్నాయన్నారు. 
 
కేసీఆర్ ప్రభుత్వం కాలంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఎన్ఆర్ఐ వేధింబపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్.ఆర్.ఐ విభాగాన్ని ఏర్పాటు చేశారని, మహిళలకు ఆర్థిక భద్రత కోసం వడ్డీ లేకుండా రుణాలను తెరాస ప్రభుత్వం ఇస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments