Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేఈఈ మెయిన్స్ ఎఫెక్టు... ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Advertiesment
Telangana
, బుధవారం, 2 మార్చి 2022 (22:12 IST)
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుంది. ఇదివరకే ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఎన్.ఐ.టి ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. 
 
మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 23వ తేదీ నుంచి నిర్వహిస్తారు. అంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు రోజులు ఆలస్యంగా ఈ పరీక్షలు జరుగుతాయి. 
 
నిజానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫలితాల్లో మార్పులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. సుఫారీ ఇచ్చి మరీ..?