Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో చిక్కుకున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్.. బోగీల్లోకి నీరు (వీడియో)

హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలు బోగీల్లోకి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరపిల

Webdunia
శనివారం, 21 జులై 2018 (13:07 IST)
హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలు బోగీల్లోకి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడిశా అతలాకుతలమైంది. రాయ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే ట్రాక్‌లపైకి కూడా వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
ముఖ్యంగా, రాయ్‌గఢ్‌ జిల్లా లక్ష్మీపురం సమీపంలోని బాలుమస్కా స్టేషన్ వద్ద భువనేశ్వర్ నుంచి జగ్దల్‌పూర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. ట్రైన్ బోగీలోకి నీరు వచ్చి చేరింది. వరద నీటిలో ట్రైన్ చిక్కుకుపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి తగ్గాక ట్రైన్ కదిలే అవకాశం ఉంది. అలాగే మరో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సింగిపురం టికిరి స్టేషన్ల మధ్య చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments