Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం... అశ్వరథ ఊరేగింపు...

ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు.

Webdunia
శనివారం, 21 జులై 2018 (12:57 IST)
ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచిన ఆ ముగ్గురికి జరిగిన సన్మానం వివరాలను స్పందించారు.
 
మహబూబాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌, నర్సంపేటకు చెందిన జడల వెంకటేశ్వర్లు, భూపాల్‌పల్లి జిల్లా జంగేడుకు చెందిన పాలిక రఘుచారి ఈ ముగ్గురు వివిధ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగారు. 
 
ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీరి ద్వారా ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అవినీతి అధికారులను పట్టించిన నిజాయితీపరులుగా వీరిని ఈ విధంగా ఘనంగా సత్కరించింది జ్వాల స్వచ్చంధ సంస్థ. 
 
ఈ ముగ్గురినీ జూలై 20వ తేదీ శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో గుర్రపు బండీ ఎక్కించి ఊరేగించారు. సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరై.. ఒక్కొక్కరికీ రూ.15వేలు నగదు బహుమతి అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments